మే 26న మనం కప్పు గెలుస్తున్నాం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు?

praveen
మరి కొన్ని రోజుల్లో భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. మార్చి 22వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్ తో ఇక క్రికెట్ పండుగ మొదలు కాబోతుంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ 17వ సీజన్లో టైటిల్ గెలవడమె లక్ష్యంగా అన్ని టీమ్స్ కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

 అయితే ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలో రెండుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్.. ఈసారి ఎంతో బలమైన జట్టుతో బరిలోకి దిగబోతుంది. ఇక టైటిల్ గెలవడం కోసం పక్క ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు అటు లక్నో జట్టుకి మెంటర్ గా వ్యవహరించిన కోల్కత్తా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఇక ఈ సీజన్ నుంచి ఏకంగా తన హోం టీం గా పిలుచుకునే కోల్కత్తా కోసమే పని చేయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని నేతృత్వంలో కోల్కతా జట్టు ఈసారి అద్భుతమైన ప్రదర్శన చేయడం ఖాయమని అటు క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఇక ఇటీవల ఇదే విషయం గురించి స్పందించిన గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని కోల్కతా నైట్ రైడర్స్ తప్పకుండా గెలవాల్సిందే అంటూ ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ తమ ఆటగాళ్ళకు స్పష్టం చేశాడు. ఆటగాళ్ళతో ఆయన మాట్లాడిన ఒక వీడియోని ఇటీవల సోషల్ మీడియాలో కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంది. మీరు ఒక గొప్ప జట్టుకు ఆడుతున్నారు. మైదానంలో ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని గర్వంగా స్వేచ్ఛతో ఆడండి. ఈ జట్టులో సీనియర్లు జూనియర్లు అంతర్జాతీయ ఆటగాళ్లు దేశవాలి ఆటగాళ్లు అనే తేడా లేదు. మే 26వ తేదీన మనం కప్పు గెలుస్తున్నాం అంటూ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లు అందరిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: