"జై హనుమాన్" కి గ్యాప్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు. ఈయన తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి , అందులో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయాలు అందుకొని తెలుగు సినీ పరిశ్రమ లో దర్శకుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ దర్శకుడు తాజాగా తేజా సజ్జ హీరో గా అమృత అయ్యర్ హీరోయిన్ గా రూపొందిన హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ 200 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు చివరన హనుమాన్ మూవీ కి కొనసాగింపుగా జై హనుమాన్ మూవీ ఉండబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఇకపోతే హనుమాన్ సినిమా సక్సెస్ కావడంతో జై హనుమాన్ సినిమాను మరికొన్ని రోజుల్లోనే మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రశాంత్ వర్మ "జై హనుమాన్" మూవీ ని కాకుండా మరో మూవీ ని రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రన్వీర్ సింగ్ హీరో గా ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమాను చేయబోతున్నట్లు ఆ మూవీ పూర్తి అయిన తర్వాత జై హనుమాన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రశాంత్ వర్మ , రన్వీర్ సింగ్ కాంబోలో రూపొందబోయే సినిమాను మైత్రి మూవీ సంస్థ వారు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pv

సంబంధిత వార్తలు: