సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న అక్కినేని కజీన్స్ లేటెస్ట్ పిక్స్..!
తాజాగా హీరో సుశాంత్ ఇంస్టాగ్రామ్ లో అక్కినేని కజిన్స్ అందరూ కలిసి ఉన్నా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో సుశాంత్ తో పాటు చాలామంది అక్కినేని కజిన్స్ ఉన్నారు. హీరో సుమంత్, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్, సుప్రియ కూడా ఈ ఫోటోలో కనిపించారు. వారితో పాటు మరికొంతమంది అక్కినేని కజిన్స్ ఉన్నారు. అందరూ కలిసి నవ్వుతూ ఫోటోలకి పోజ్ ఇచ్చారు.సుశాంత్ షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని కజిన్స్ అందరినీ ఒకే దగ్గర చూసి అక్కినేని అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక ఇందులో కొందరు అక్కినేని సినిమాలతో బిజీగా ఉంటే మరి కొందరు బిజినెస్ లతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తమకంటూ కొంత సమయాన్ని కేటాయించడానికి ఆదివారం అందరూ వీలు చేసుకొని కలుసుకున్నారు.
ఫోటోలో ఉన్న మిగతా అక్కినేని హీరోలతో పోలిస్తే అక్కినేని నాగచైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే దూత అని వెబ్ సిరీస్ తో మంచి హిట్ అందుకున్న నాగచైతన్య ఇప్పుడు తండేల్ సినిమా తో బిజీగా ఉన్నారు. ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత అఖిల్ ఇంకా వెండి తెర మీద కనిపించలేదు. సుశాంత్, సుమంత్, సుప్రియ కూడా సినిమాలలో అంత యాక్టివ్ గా లేరు.