త్వరలో అంబాసిడర్ 2.0.. బెంజ్ కూడా బెండవ్వాల్సిందే?

Purushottham Vinay
1980 నుంచి 2006 కాలం మధ్య భారత కార్ల మార్కెట్ దిగ్గజం అంబాసిడర్ ఒక ఊపు ఊపిందనే చెప్పాలి.హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ నుంచి విడుదల అయిన ఈ కారు అప్పట్లో కేవలం రాజకీయ నాయకులు, ప్రముఖులు ఇళ్లల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు బెంజ్ కార్లకి ఉన్న స్టేటస్ అప్పుడు ఈ కార్లకి ఉండేది.ఇండియన్ ఆటోమోబైల్ మార్కెట్ ను దాదాపు 70 శాతం ఆక్రమించిన ఈ మోడల్ విక్రయాలు కొత్త కార్ల పోటీ క్రమంగా తగ్గిపోయాయి. దీంతో 2014లో ఈ కార్ల ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో అంబాసిడర్ హక్కులను ఫ్యూజో అనే కంపెనీ కేవలం రూ.80 కోట్లకు మాత్రమే దక్కించుకుంది. ఆ తరువాత ఈ కారు మళ్లీ మార్కెట్లోకి వస్తుందని ఎవరూ కూడా అసలు ఊహించలేదు. కానీ ఇప్పుడు అంబాసిడర్ కార్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ కార్లని తలదన్నే రేంజ్ లో సరికొత్త అవతారంలో వస్తుంది. ఇక ఈ కార్ ఎలా ఉండనుందంటే?కొత్త అంబాసిడర్ 2.0 కారును హిందూస్తాన్ చెన్నై ప్లాంట్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కొత్త అంబాసిడర్ ను లాంచ్ చేసే క్రమంలో హిందూస్థాన్ మోటార్స్ డైరెక్టర్ మీడియాకు పలు విషయాలు చెప్పారు.


 ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుంచి కొంచెం బటయపడ్డామని, యూరోపియన్ కంపెనీల భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు.ఇందులో భాగంగా రూ.600 కోట్ల పెట్టుబడితో అంబాసిడర్ 2.0 ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఆటోమోబైల్ రంగంలో తిరుగు లేని రారాజుగా చక్రం తిప్పిన అంబాసిడర్ ప్రేమికులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ కారు రూపంలో మళ్లీ రోడ్లపైకి రానుండడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ కార్ ఫీచర్స్, ధర త్వరలో ప్రకటిస్తామని కంపెనీ డైరెక్టర్ తెలిపారు. 80వ దశకంలో ఒక ఎంతో ఆదరణ పొందిన అంబాసిడర్ మళ్లీ రాబోతుందంటే కారు ప్రియులకు పండుగే.చూడాలి అంబాసిడర్ 2.0 ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో గత వైభవాన్ని తీసుకొస్తుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: