"పుష్ప 2" భారీ ఎమోషన్ ట్రాక్..?

MADDIBOINA AJAY KUMAR
అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "పుష్ప పార్ట్ 1" మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకు ల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి . అలాగే ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వరించింది . ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్ ఈ సినిమా కు దర్శకత్వం వహించాడు.

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో ఫహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించ గా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు . సమంత ఈ మూవీ లో ఐటమ్ సాంగ్ చేయ గా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఇందులో ముఖ్య పాత్రలలో నటించారు . ఇక పోతే ఈ మూవీ లో దర్శకుడు సుకుమార్ చాలా ఎమోషన్స్ సన్నివేశాలను చిత్రీకరించారు . అందులో చాలా వరకు ప్రేక్షకులను కదిలించాయి.

ఇక "పుష్ప పార్ట్ 2" మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యం లో ఈ సినిమా లో ఎమోషన్ డోస్ మరింత పెంచేందుకు సుకుమార్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నట్లు అందులో భాగంగా చాలా సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే "పుష్ప పార్ట్ 2" లో ఫ్రెండ్షిప్ కు సంబంధించిన ఎమోషన్ బలంగా ఉండబోతున్నట్లు అందులో భాగంగా అల్లు అర్జున్ పాత్రకు కేశవ పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచే విధంగా సుకుమార్ చిత్రీకరించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: