"విశ్వంబర" కోసం మొత్తం ఎన్ని సెట్స్ వెయ్యనున్నారో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ సినిమాను ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సంబంధించిన దాదాపు మొత్తం షూటింగ్ సెట్స్ లోనే జరగబోతున్నట్లు తెలుస్తుంది. దానితో ఈ సినిమా కోసం మొత్తం 17 సెట్ ను వేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే కొన్ని సెట్ లను వేసినట్లు , అందులో కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా కోసం భారీ సెట్ లను వేసి అందులోనే ఈ సినిమాను ఎక్కువ భాగం షూట్ చేసే విధంగా ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీవ్లో గ్రాఫిక్స్ భాగం కూడా ఎక్కువగానే ఉండబోతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన భారీ ఇంటర్వెల్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశం ఈ సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తూ ఉండడం , బింబిసారా బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: