"రత్నం" డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటలలో విశాల్ ఒకరు. ఈయన తాజాగా రత్నం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తాజాగా ఏప్రిల్ 26 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి భారీ మొత్తంలో కలక్షన్ లు రావడం లేదు.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్ లను బట్టి చూస్తే ఈ మూవీ భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసే లక్షణాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఒక వైపు ఈ సినిమాకు తమిళనాడు లో విజయ్ హీరోగా రూపొందిన గిల్లి సినిమా ఎఫెక్ట్ కూడా బాగా పడింది. గిల్లి మూవీ రీసెంట్ గా రీ రిలీస్ కాగా దాని వైపే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతో ఉండడంతో ఈ మూవీ కి కాస్త కలెక్షన్లు తగ్గాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా కొన్ని వారాల తర్వాత ఈ సినిమాను ఈ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో స్ట్రీమింగ్  చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరి దర్శకత్వం వహించగా ... ప్రియ భవాని శంకర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: