అండర్ 19ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ తో తలపడే ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది. గురువారం న్యూజిలాండ్ , బంగ్లాదేశ్ లమధ్య జరిగిన రెండో సెమిస్ లో కివీస్ పై బంగ్లా 6వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50ఓవర్ల లో 8వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 4వికెట్లు కోల్పోయి 44.1ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ కు అర్హత సాధించింది. ఇక మొదటి సెమీస్ లో పాక్ ను చిత్తుగా ఓడించి టీమిండియా ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే అండర్ 19ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ ఫైనల్ కు చేరడం ఇదే మొదటిసారి కాగా డిపెండింగ్ ఛాంపియన్ భారత్ కు ఇది ఆరోసారి.దాంతో రాకరాక ఫైనల్ కు వచ్చిన బంగ్లాదేశ్ ఎలాగైనా కప్ ను ఎగురేసుకెళ్లాలని పట్టుదలతో ఉండగా వరసగా రెండో సారి కూడా కప్ ను ముద్దాడి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఊవిళ్లురోతుంది. ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగనుంది.