ఏపీ : టిడిపి తో పొత్తు.. బిజెపి కొత్త డిమాండ్.. బాబు ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న టిడిపి ఇక మెజారిటీ స్థానాలలో ఏపీ ఎన్నికల్లో బరులు దిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒప్పందం ప్రకారం బిజెపికి రెండు ఎంపీ సీట్లతో పాటు 10 అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించారు. కానీ ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలో బిజెపి కొత్త డిమాండ్ తెరమీదకి తీసుకురావడంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలైంది అన్నది తెలుస్తుంది. బిజెపి ఇప్పటికే ఆరు ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. అయితే పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే నిర్ణయించామని చెబుతున్న ఇక అధికారిక ప్రతినిధుల మాత్రం రాలేదు.
ఇంతలోనే తమకు అదనంగా మరో సీటు ఇవ్వాలి అంటూ కొత్త డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఇటీవలే బిజెపి ఎన్నికల ఇన్చార్జ్ అరుణ్ సింగ్ నేతృత్వంలో పదాధికారుల సమావేశం జరగగా.. బీజేపీ 11 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. అయితే బిజెపి సీనియర్ నేత సోము వీర్రాజు కోసం తొలిత రాజమండ్రి ఎంపీ పరిధిలోని అనపర్తి స్థానం ఇచ్చేందుకు సిద్ధమైన.. ఇక అక్కడ నుంచి పోటీ చేసేందుకు వీర్రాజు విముఖత వ్యక్తం చేశారట. దీంతో ఇప్పుడు రాజమండ్రి సిటీ, లేదంటే రాజమండ్రి రూరల్ స్థానాలలో ఏదో స్థానాన్ని అదనంగా బిజెపికి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారట.