తారక్ విశ్వరూపం చూపించాడు : రాజమౌళి

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో స్టూడెంట్ నెం.1 చిత్రంతో దర్శకుడిగా రాజమౌళి, హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఎంట్రీ ఇచ్చారు.  తర్వాత ఇద్దరూ తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటు వచ్చారు.  ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకధీరుడుగా రాజమౌళి ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఇండస్ట్రీకి అందించారు.  ఇక ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నారు.

తాజాగా బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించిన ‘జై లవ కుశ’ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.   మొదటి నుంచి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరుగుతూ వచ్చాయి.  సెకండాఫ్ లో ఎన్టీఆర్ రావణ్ క్యారెక్టర్ తీరు తెన్నులతో ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులు ఊగిపోయేలా చేసాడు.

ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  జై, ల‌వ కుమార్‌, కుశ పాత్రలు మూడింటికీ ఎన్టీఆర్ స‌రైన న్యాయం చేశాడ‌ని, ఆ పాత్ర‌ల్లో జీవించేశాడ‌ని ఆయ‌న‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి స్పందిస్తూ..త‌న హృదయం గ‌ర్వంతో ఉప్పొంగిపోతోంద‌ని, తార‌క్ న‌ట‌న‌ను వ‌ర్ణించ‌డానికి మాట‌లు చాల‌వని పేర్కొన్నారు. జై ‘జై’ అని అన్నారు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించగా ఎన్టీఆర్ నట విశ్వరూపం కు తోడూ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ గా నిలిచింది . మొత్తానికి ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఈలలతో గోల చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 
Tarak.. my heart is swelling with immense pride..words are just not enough..jai JAI..🙏 #JaiLavaKusa

— rajamouli ss (@ssrajamouli) September 21, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: