మరోసారి నోరు జారిన బాలీవుడ్ హీరో..!

Edari Rama Krishna
బాలీవుడ్ లో ఫృథ్విరాజ్ కపూర్ నుంచి ఇప్పటి రన్ బీర్ కపూర్ వరకు ఎంతో మంది హీరోలు బాలీవుడ్ లో తమసత్తా చాటారు.  అంతే కాదు రణదీర్ కపూర్ ఇద్దరు కూతుళ్లు కరిష్మాకపూర్, కరీనా కపూర్ లు కూడా నెంబర్ వన్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు.  ఇక బాలీవుడ్ రిషికపూర్ అంటే ఎంతో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.  హీరోగా కొనసాగినంత కాలం రిషికపూర్ వివాదాల జోలికి వెళ్లకుండా ఉన్నారు.  కానీ గత కొంత కాలం ఈ బాలీవుడ్ హీరో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.

 సాక్షత్తు తండ్రి రాజ్ కపూర్ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  తాజాగా మ‌హిళల వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో అత‌ను చేసిన ట్వీట్‌.. వివాద‌మైంది. 2002లో నాట్‌వెస్ట్ ట్రోఫీ గెలిచిన సంద‌ర్భంగా గంగూలీ లార్డ్స్ బాల్క‌నీలో ష‌ర్ట్ విప్పి తన సహ క్రీడాకారులతో సంబరాలు చేసుకున్నారు.  

అయితే దీనికి సంబంధించిన ఫోటో ఒకటి రిషికపూర్ పోస్ట్ చేస్తూ..మ‌హిళ‌ల వ‌రల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ఈ క్ష‌ణం కోసం ఎదురు చూస్తున్నాన‌ని అత‌ను ట్వీట్ చేశాడు.  దీంతో చిర్రెత్తుకొచ్చిన నెటిజన్లు రిషికపూర్ పై ఫైర్ అయ్యారు.  దీంతో త‌న ట్వీట్‌ను స‌మ‌ర్థిస్తూ మ‌రో ట్వీట్ చేయ‌డం చాలా మందిని మ‌రింత ఆగ్ర‌హానికి గురి చేసింది.
Waiting for a repeat of Sourav Ganguly's act on the balcony of The Lords Ground,London,when India beat England 2002 NatWest series final! YO pic.twitter.com/z1XAde3JLb

— Rishi Kapoor (@chintskap) July 23, 2017 WHAT WRONG HAVE I SAID? I DIDNT SAY ANY FEMALE PLAYER SHOULD!I ONLY SAID SOURAV GANGULY SHOULD REPEAT HIS SHOW. YOU HAVE A WRONG MIND DEAR!

— Rishi Kapoor (@chintskap) July 23, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: