"టిల్లు స్క్వేర్" సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
స్టార్ బాయ్ సిద్దు జొన్నల గడ్డ తాజాగా "టిల్లు స్క్వేర్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నిన్న అనగా మార్చి 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. దానితో ఈ మూవీ కి నిన్న అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ మూవీ కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ కొన్ని వారాల ధియేటర్ రన్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అక్కడ కొన్ని వారాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను "నెట్ ఫ్లిక్స్" సంస్థ వారు కైవసం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించగా ... మురళి శర్మ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: