యాంకర్ గా మారిన నిహారిక.. ఇంత బోల్డ్ గా అడిగేస్తుందేంటి?

praveen
మెగా డాటర్ నిహారిక గత కొంతకాలం నుంచి ఏదో ఒక విధంగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. ఇక విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది ఈమె. అయితే ఒకవైపు వెబ్ సిరీస్లలో నటిస్తూ ప్రేక్షకులు అలరిస్తుంది. ఇక మరోవైపు ఫారిన్ ట్రిప్లకు వెళ్తూ ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూఉంది మెగా డాటర్ నిహారిక. ఇక ఇప్పుడు చెఫ్ మంత్రా అనే కుకింగ్ షోలో యాంకర్ అవతారం ఎత్తింది. అయితే నిహారికకు యాంకరింగ్ కొత్తేమీ కాదు  గతంలో ఈటీవీలో ఢీ అనే షోలో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఆహా ఓటీపీ వేదికగా.. టెలికాస్ట్ అవుతున్న చెఫ్ మంత్ర కొత్త సీజన్లో యాంకరింగ్ చేస్తుంది.

 అయితే ఇప్పటికే ఈ షో రెండు సీజన్ లు పూర్తి చేసుకోగా.  ఇక ఇప్పుడు మూడోది మొదలైంది. యాంకర్ గా అదరగొడుతుంది నిహారిక. చెఫ్ మంత్ర కార్యక్రమానికి సంబంధించి కొత్త ఎపిసోడ్ రిలీజ్ అయింది  అయితే ఇక ఇందులో యాంకరింగ్ చేసిన నిహారిక.. ఏకంగా బోల్డ్ ప్రశ్నల తో అందరిని అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ఇక ఈ షోలో అటు అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ తో హిట్టు కొట్టిన సుహాస్, శరణ్య ఇద్దరు పాల్గొన్నారు  ఈ క్రమంలోనే యాంకర్ నిహారిక ఈ ఇద్దరితో ఎన్నో కబుర్లు కూడా చెప్పింది. ఈ క్రమంలోనే నిహారిక ప్రోమోలో సుహాస్, శరన్యను అడిగిన ప్రశ్నలు చూసి అందరూ షాక్ అయ్యారు.

 మీరు డాష్ లేకపోతే ఉండలేరు అంటూ ఒక ప్రశ్న నిహారిక అటు సుహాస్ ని అడిగింది. దీంతో ఒక్కసారిగా అతను షాక్ అయ్యాడు. ఇక శరణ్యను ఇంకా బోల్డ్ గా ప్రశ్న అడిగేసింది. మీరు ఇష్టంగా డాన్స్ చేసింది ఎవరితో అంటూ ప్రశ్న అడిగింది. అయితే ఈ ప్రశ్నలకు వాళ్లు నవ్వుతూ సిగ్గుతో సమాధానం చెప్పడం ఈ ప్రోమోలో లో కనిపిస్తుంది. ఇక శరణ్యకు వచ్చిన ప్రశ్న చూసి ఆయనే చేస్తారు పాపం అంటూ సుహాస్ సెటైర్ వేశాడు. దీనికి స్పందించిన శరణ్య నీకు దండం పెడతా అంటూ సుహాస్ ని ఆపేందుకు ప్రయత్నించింది. ఇలా ఏకంగా నిహారిక బోల్డ్ ప్రశ్నలతో ఇక ఈ ప్రోమోలో అందరిని అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమా విశేషాలను పంచుకున్నారు సుహాస్, శరణ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: