నా భర్త కంటే ధనవంతులు కూడా.. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు : హీరోయిన్

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. చాలావరకు  ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలే ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ హీరోయిన్ ఆ సినిమాలో నటిస్తుంది లేదంటే ఆ హీరోతో రిలేషన్షిప్ లో ఉంది అంటూ వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి వార్తలు కూడా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కానీ కొంతమంది సినీ సెలబ్రిటీలు మాత్రం ఏకంగా వార్తల్లో నిలవడానికి పుట్టారేమో అన్న విధంగా ఎప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఇలా ఎక్కువగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయే జంటలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిలో వ్యాపారవేత అయిన రాజకుంద్రా.. ఇక బాలీవుడ్ బ్యూటీ శిల్ప శెట్టి జంట కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి జంట ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. ఇక వివాదాస్పద వ్యాఖ్యలతోను వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే వ్యాపారవేత రాజ్ కుంద్రాకు ఉన్న ఆస్తి అంతస్తులు డబ్బును చూసే అటు బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఆయనను పెళ్లి చేసుకుంది అంటూ గత కొంతకాలం నుంచి ఒక వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.

 అయితే ఇంటర్నెట్ మొత్తం పాకిపోయిన ఈ న్యూస్ అటు బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కంటపడింది. దీంతో ఇక తనపై వస్తున్న ఈ రూమర్ పై స్పందించింది శిల్పా శెట్టి. ఈ క్రమంలోనే షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సమయంలో మా కుంద్రా కంటే ధనికులు నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే నా జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బు నా నిర్ణయాలను ప్రభావితం చేయలేదు. రాజ్ కుంద్రాను డబ్బు చూసి పెళ్లి చేసుకోలేదు. అతని మనసు చూసే పెళ్లి చేసుకున్నాను అంటూ శిల్పా శెట్టి కామెంట్ చేసింది. కాగా వీరిద్దరికి 2009 నవంబర్ 22వ తేదీన పెళ్లి జరగగా.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: