టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్ బ్యూటీ ప్రియమణి.. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో సహాయక పాత్రలు పోషిస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా కమిట్ అవుతూ కెరీర్ ను కొనసాగిస్తోంది. ప్రియమణి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన టైమ్ లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది. అయితే ముస్తఫా రాజ్ కు ఇది రెండో వివాహం. ప్రియమణి కంటే ముందు ముస్తఫా రాజ్ ఒక యువతిని వివాహం చేసుకోగా.. మనస్పర్థలు విడిపోయారు. ఆ తర్వాత ప్రియమణి,
ముస్తఫా రాజ్ ప్రేమించుకుని.. చాలా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగి చాలా ఏళ్లు అవుతున్నా.. వీరిద్దరికీ సంతానం లేరు. ఇకపోతే ప్రియమణి నటించిన భామా కలాపం2 మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. భూమాకలాపం2 ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భామకలాపం2 కోసం రెట్టింపు సాహసం చేశానని ప్రియమణి తెలిపారు. రియల్ లైఫ్ లో ఏ వంటకం బాగా వండుతారనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ తెరపైనే కానీ తెర వెనుక నేనేం ఉండనని
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్ బ్యూటీ ప్రియమణి చెప్పుకొచ్చారు. భర్త వండితే బాగా తింటానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. నిజ జీవితంలో మీ భర్తకు మీరు భయపడతారా అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ కొన్నిసార్లు నేను భయపడతానని కొన్నిసార్లు నా భర్తను భయపెడతానని కామెంట్లు చేశారు. చాలా కాలం తర్వాత ఈరోజే రవితేజను మీట్ అయ్యానని అప్పుడు ఎంత ఎనర్జిటిక్ గా రవితేజ ఉండేవారో ఇప్పుడూ అలాగే ఉన్నారని ప్రియమణి వెల్లడించారు. ప్రియమణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.