పాక్‌ ఐఎస్‌ఐకు కొత్త అధిపతి.. ఇండియానే టార్గెట్‌?

పాకిస్థాన్ నిఘా సంస్థ.. అంటే ఇంటర్‌సర్వీసెస్ ఇంటిలిజెన్స్.. ఐఎస్ఐ. దీని పని పాక్ లో ఎలాంటి దాడులు జరగకుండా చూడటం. కానీ ఇది దాని పని చేయదు. కేవలం ఇండియాలో ఉన్న ముస్లిం యువతను రెచ్చగొట్టడం వారిలో అమాయకులైన వారిని ఎంచుకొని ఉగ్ర కార్యకలాపాలు చేయించడం, వారికి శిక్షణ ఇవ్వడం వీరి పని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది అమాయక ముస్లిం యువకులు ఐఎస్ఐ చేసిన కుట్ర వల్ల జైలు పాలయ్యారు. ఎంతో మంది ఉగ్రవాద భావజాలానికి లోనయ్యారు. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు. దీనితో పాక్ ప్రభుత్వం ఐఎస్ ఐ చీఫ్ ను తొలగించిన నూతన వ్యక్తిని దీనికి అధిపతిగా నియమించింది.

ఐఎస్ఐ గత కొన్నేళ్ల కిందట ఎంతో మంది మత పెద్దల ద్వారా, యువతను రెచ్చగొట్టి దేశంలో దాడులు జరిగేలా చూడటం. హైదరాబాద్, ముంబాయి పేలుళ్ల కేసులో కూడా దేశం లోనే యువతే పాల్గొన్నారు.  ఐఎస్ఐ డీజీ తన మార్కును అందుకోలేకపోతున్నాడు. కాబట్టి అతడిని తీసేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్కువగా కుట్రలు చేసి భారత్ లో అలజడులు సృష్టించలేని వ్యక్తి ఐఎస్ఐకి అనర్హుడని పాక్ అభిప్రాయం. కానీ గతంలో కాంగ్రెస్ హయాంలో మైనార్టీ ఓట్ల కోసం కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించిన వారిని సైతం చూసీ చూడనట్లు వ్యహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎన్నో ప్రాంతాలు మత విద్వేషాలు, బాంబు దాడులు జరిగాయి. దీనికి పరోక్షంగా కారణం ఐఎస్ఐ.

భారత్ లో అశాంతిని రేపేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం దాని పాచికలు పారడం లేదు. దేశంలో విస్తృతమైన తనిఖీలు, బలమైన నిఘా వ్యవస్థతో దాడులను దేశ ఇంటిలిజెన్స్ విభాగం ఎక్కడికక్కడ అడ్డకుంటుంది. ఏదైమైనా పాక్ లో బలంగా పని చేయాల్సిన ఐఎస్ఐ మన దేశంలో అమాయక యువతపైనే దృష్టి పెడుతోంది. దీన్ని మానుకుంటేనే పాక్ కు, ఐఎస్ఐకు మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: