షాకింగ్ : చితికి నిప్పంటించే.. కొన్ని క్షణాల ముందు కళ్ళు తెరిచింది?

praveen
సాధారణంగా సినిమాలో చూపించే కొన్ని కొన్ని ఆసక్తికర ఘటనలు కొన్నిసార్లు నిజజీవితంలో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే కొన్ని దయ్యాల సినిమాల్లో కొంతమంది చనిపోయి ఇక స్మశాన వాటికకు తీసుకువెళ్లిన తర్వాత ఊహించని రీతిలో సరిగ్గా అంత్యక్రియలు పూర్తి చేసేటప్పుడు ఒక్కసారిగా లేచి కూర్చోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సన్నివేశాలు కొన్నిసార్లు సినిమాలో చూసినప్పుడు నవ్వు తెప్పిస్తే ఇంకొన్నిసార్లు మాత్రం కాస్త భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటివి రియల్ లైఫ్ లో జరుగుతుందా అంటే మాత్రం ముమ్మాటికి జరగదు అని చెబుతారు ఎవరైనా. ఎందుకంటే ఒక్కసారి చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతకడం అనేదిఅసాధ్యమని బల్లగుద్ది మరి చెబుతూ ఉంటారు.

 కానీ ఇటీవల కాలంలో ఒకప్పుడు సినిమాలు చూపించినటువంటి ఘటనలే రియల్ లైఫ్ లో కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా చనిపోయారు అంటూ అంత్యక్రియలకు సిద్ధమైన సమయంలో ఒక్కసారిగా చనిపోయిన వారు ఊపిరి పోసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఇక మరికొన్ని నిమిషాల్లో చితికి నిప్పుంటిస్తారు అనే సమయంలో ఏకంగా మహిళ కళ్ళు తెరిచింది. దీంతో అక్కడున్న వారందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. ఒడిశాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. బెరహం పూర్ లో జరిగిన ఈ వింత ఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు.

 52 ఏళ్ల మహిళ అగ్ని ప్రమాదానికి గురైంది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇక ఈ ప్రమాదంలో ఆమె 50% కాలిపోగా ఇక కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు  ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇక ఇటీవలే ఆమెని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకువచ్చారు. కానీ మరునాడు ఆమె శ్వాస తీసుకోలేదు. ఇక ఆమెలో ఎలాంటి చలనం కూడా కనిపించలేదు. దీంతో చనిపోయింది అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇక సదరు మహిళ అంత్యక్రియల కోసం దహనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే దహనం చేయడానికి కొద్ది క్షణాల ముందు ఆమె కళ్ళు తెరవడంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: