పోలీసులకు లోంగిపోనున్న టీడీపీ నేత

టీడీపీ నేత కూన రవికుమార్ నేడు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన ఇటీవల మాజీ తహశీల్దార్‌‌ను దూషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక అక్కడి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. నేడు ఆయన అజ్ఞాతం వీడే సూచనలు కనపడుతున్నాయి. 

 

కూన రవి కుమార్ తనను దూషించారంటూ పొందరూ మాజీ తహశీల్దార్ రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ నేపధ్యంలోనే పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేయగా ఆయన ఫిర్యాధుని తీసుకున్న పోలీసులు రవి కుమార్ పై 353, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉండగా నేడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: