టీవీ: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ యాంకర్.. తెలిస్తే షాక్..!

Divya
సినీ సెలబ్రిటీలు ఎలాంటివి చేస్తే అభిమానులు, ప్రేక్షకులు కూడా అలాంటిదే చేస్తారని నమ్మకం చాలా మందికి ఉన్నది.. అందుకే చాలా మంది సెలబ్రిటీలను కొన్ని యాడ్స్ ను పలు రకాల మాటలను చెప్పించడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా దసరా పండుగకి అమ్మవారి నవరాత్రులు చేస్తూ ఉంటారు కనుక ఒక్కో అవతారంలో ఒక్కొక్కరు పూజిస్తూ ఉంటారు. 9 రంగుల దుస్తులను ధరించి దుర్గామాతను భక్తులు కొలుస్తూ ఉంటారు. అయితే తాజాగా ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పేరుపొందిన యాంకర్ లాస్య ధనదైన స్టైల్ లో నవరాత్రుల లుక్స్ ను అభిమానులకు పంచుకుంది.

నవరాత్రులలో భాగంగా తన మొదటి రోజు శైలపుత్రి రూపం గురించి తెలియజేస్తూ పసుపు రంగు చీర ధరించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ తర్వాత రెండవ రోజు బ్రహ్మచారిని దేవి రూపంలో ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించింది. ఇది సమాజంలో ఉండే ప్రకృతికి ,శాంతికి ఆకుపచ్చ రంగు చీరను ధరించిందట.. నవరాత్రి మూడవ రోజున చంద్రఘట్టం రూపంలో  కనిపిస్తూ ఇందులో ఆమె బిడ్డను చంకలో పెట్టుకొని మరి కొన్ని ఇటుక పిల్లలు మోస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది లాస్య. అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు పలువురి నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
మరి కొంతమంది అసలు ఈ యాంకర్ అమ్మకు ఏమయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు విషయం తెలుసుకున్న తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గతంలో యాంకర్ లాస్య ఏ టీవీ షోలో చూసిన ఎక్కువగా కనిపించేది.. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించకపోవడమే కాకుండా తానే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి తన కుటుంబానికి సంబంధించిన వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది యాంకర్ లాస్య.. మొత్తానికైతే లాస్య తను అనుకున్న విషయాలను సైతం అభిమానులతో పంచుకోవడానికి ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: