టీమిండియాకు గుడ్ న్యూస్.. అత్తనొచ్చేస్తున్నాడు?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలకమైన ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఇక జట్టుకు దూరమవుతూనే ఉన్నారు. అయితే కొంతమంది ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో కూడా జట్టుకు అందుబాటులో ఉండడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహమ్మద్ షమీ గాయం నుండి కోలుకోకపోవడంతో జట్టుకు అందుబాటులో లేడు. ఇక మరోవైపు.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు గాయం బారిన జట్టుకు దూరమయ్యారు. కోహ్లీ వ్యక్తిగత కారణాలతో టెస్టు సిరీస్ కి పూర్తిగా దూరమయ్యాడు.

ఇలా కీలక ప్లేయర్లు లేకుండానే భారత జట్టు వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఇలాంటి సమయంలో ఇక ఎంతో అనుభవం ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టు విజయాలలో  కీలకపాత్ర వహిస్తున్నాడు. తన స్పిన్ బౌలింగ్ తో ఎప్పటిలాగే మ్యాజిక్ చేస్తున్నాడు. ఇక ఇటీవల మూడో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఒక వికెట్ పడగొట్టడం ద్వారా టెస్ట్ ఫార్మాట్లో 500 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. ఏకంగా వ్యక్తిగత కారణాలతో  ఇంటికి వెళ్ళిపోయాడు.
 ఈ క్రమంలోనే మూడో రోజు ఆటలో అశ్విన్ లేకపోవడంతో కేవలం నలుగురు బౌలర్లతోనే టీమ్ ఇండియా మ్యాచ్ ను కొనసాగించింది. అయితే ఇక ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్ హోరా హోరీగా  జరుగుతూ ఉండగా.. టీమ్ ఇండియాకి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వ్యక్తిగత కారణాలవల్ల జట్టు నుంచి తప్పుకొని ఇంటికి వెళ్లిన రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ ఇప్పుడు రాజ్కోట్ చేరుకున్నాడు అన్నది తెలుస్తుంది. చెన్నై నుంచి మళ్లీ జట్టుతో చేరేందుకు అశ్విన్ రాజ్కోట్ కు బయలుదేరినట్లు క్రిక్ ఇన్ఫో తెలిపింది. ఈ క్రమంలోనే టెస్టులో ఐదో రోజు ఆటకు అతను జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: