ఏపీ: ఏపీ రాజకీయాలను అసహ్యంగా మార్చేసిన టీడీపీ నేతలు..??

Suma Kallamadi
ఆంధ్రాలో రాజకీయాలు అసహ్యకరమైన కింది స్థాయికి దిగజారాయి. మంచిగా ప్రవర్తించాల్సిన పార్టీ నేతలు అత్యంత చిల్లరగా ప్రవర్తిస్తూ చాలామందికి షాక్‌లు ఇస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు తప్పు చేసిన వారికి వత్తాసు పలుకుతూ అందరి చేత తిట్లు తింటున్నారు. కోడి కత్తి కేసులో నిందితుడైన శ్రీనివాసరావును టీడీపీ పార్టీ వెనకేసుకొస్తోంది. అతడు ఒక సత్పురుషుడు అంటూ ప్రచారం చేస్తోంది. ఒక సీఎం అభ్యర్థి పై కత్తితో బలంగా పొడిచే రక్తం వచ్చేలా చేశాడు శ్రీనివాస్ ఒక రకంగా అది పెద్ద మర్డర్ అని చెప్పుకోవచ్చు అలాంటి శ్రీనివాస్ రావుకి టీడీపీ పార్టీ మద్దతు ఇవ్వడం నిజంగా సిగ్గుచేటు అని చెప్పవచ్చు.
అంతేకాదు అతడికి బెయిల్ ఇవ్వాలని కూడా పోరాటం చేశారు చివరికి అతడిని తన పార్టీలో చేర్చుకున్నారు కూడా. జగన్ పై దాడి చేసిన వ్యక్తులు టీడీపీ వాళ్లకి మంచి మిత్రులు అవుతారు. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. వైఎస్ వివేకానంద రెడ్డిని పొడిచిన దస్తగిరి కూడా హీరో అవుతాడు. ఇక డ్రగ్స్ కేసులో పట్టుబడిన వ్యక్తులను కూడా తప్పించి వీరు చాలా పెద్ద నష్టాన్ని ఏపీ రాష్ట్రానికి కలిగిస్తుంటారు.
ఇక ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయి దాడిపై కూడా టిడిపి స్పందిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. చాలా పెద్ద రాయి జగన్ కంటి పై భాగంలో తగిలిన సంగతి తెలిసిందే దీనివల్ల శరీరం పగిలిపోయింది రక్తం కూడా బాగా వచ్చింది రెండు కుట్లు కూడా పడ్డాయి. ఇదంతా ప్రజల కళ్ళముందే జరిగింది. ఇంత పెద్ద హృదయ విదారక ఘటన జరిగితే దాని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, గులకరాయి, అది కూడా చిన్న రాయి దానికి ఇంత రాద్ధాంతం చేస్తారా? అంటూ చంద్రబాబు ప్రతి సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇంకా అలాంటి పెద్ద రాళ్లతో అతని కొట్టి చంపాలి అంటూ జగన్మోహన్ రెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు జగన్ కి జరిగింది దాడే కాదని అది ఒక నాటకం కూడా నీచంగా మాట్లాడుతున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీల వ్యవహార తీరు కొంచెం ఇలాగ ఉంటుంది కానీ ఏపీలో మాత్రం ప్రతిపక్ష పార్టీలు తెగ రెచ్చిపోతున్నారు. జగన్ వీరి ఆటలను చూసి చూడనట్టు మౌనంగా ఉంటున్నారు. ప్రజల మనసుల్లో తాను ఉంటే చాలు ఎవరు ఏం చేస్తున్నా తనకు అనవసరమైనట్టు ముందుకు సాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: