అరబ్ షేక్ అవతారమెత్తిన సెహ్వాగ్.. ఫోటో చూసి అభిమానులు షాక్?

praveen
టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. నిన్నటి తరం ప్రేక్షకులకు మాత్రమే కాదు నేటితనం ప్రేక్షకులకు కూడా అతను సుపరిచితుడు. ఒకప్పుడు భారత జట్టు తరఫున ఇక విధ్వంసకర ఓపనర్ గా పేరు సంపాదించుకున్నాడు. అతను బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చాడు అంటే చాలు ఇక బౌలర్ల అందరి వెన్నులో వణుకు పుట్టేది. ఎందుకంటే మొదటి బంతికే సిక్సర్ కొట్టి తన విధ్వంసాన్ని ప్రారంభించేవాడు.

 వీరబాదుడు అంటే ఎలా ఉంటుందో తన బ్యాటింగ్లో చూపించేవాడు వీరేంద్ర సెహ్వాగ్  ఇక ఫార్మాట్ తో సంబంధం లేకుండా తన బ్యాటింగ్ విధ్వంసం కొనసాగించాడు అని చెప్పాలి. ఇక ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్లో ఎనలేని సేవలు అందించి లెజెండ్ గా అవతరించాడు. అయితే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులందరికీ కూడా ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. అయితే కేవలం క్రికెట్ విషయంలోనే కాదు ఇక ప్రేక్షకులను అలరించడం విషయంలోనూ వీరేంద్ర సెహ్వాగ్ ను మించిన వారు మరొకరు లేరు  తనదైన శైలిలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై కామెంట్ చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఎప్పుడూ భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అరబ్ షేక్ అవతారం ఎత్తి వార్తలో హాట్ టాపిక్ గా మారిపోయాడు  ఇంటర్నేషనల్ లీగ్ టి20 ఫైనల్ మ్యాచ్ కి ముందు కొత్త లుక్ లో కనిపించాడు వీరేంద్ర సెహ్వాగ్. మ్యాచ్ ప్రెసెంటర్ గా ఉన్న ఆయన అరబ్ షేక్ అవతారంలో కనిపించి.. అభిమానులకు కనువిందు చేశాడు   ఆయనతో పాటు పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా అక్కడ ఉన్నారు అని చెప్పాలి. ఇక వీరిద్దరూ అరబ్ షేక్ అవతారంలో కనిపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా ఇటీవలే ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో.. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు విజయం సాధించింది. దుబాయ్ కాపిటల్స్ ని ఓడించి టైటిల్ అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: