"బాక్" కోసం రంగంలోకి దిగిన ఇద్దరు అందగత్తెలు..!

MADDIBOINA AJAY KUMAR
కెరియర్ లో మొట్ట మొదటి సారి మిల్కీ బ్యూటీ తమన్నా , అందాల బ్యూటీ రాశి కన్నా కలిసి "అరుణ్మనై 4" అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని తెలుగు లో బాక్ అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సుందర్ సి దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో వెన్నెల కిషోర్ , శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని మే 3 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. దానితో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ను బట్టి చూస్తే ఇందులో తమన్నా మరియు తన భర్త అనుమానాస్పదంగా చనిపోతారు. దానితో దానిని కనుక్కోవడానికి తమన్నా సోదరుడు అయినటువంటి సుందర్ వచ్చి అసలు ఏం జరిగింది అనే దాన్ని తెలుసుకుంటాడు. ఇక ఇదే బాక్ మూవీ గా జనాల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తెలుగు లో కూడా ఈ చిత్ర బృందం ప్రమోషన్ లను మొదలు పెట్టింది. ఇకపోతే తమన్నా , రాశి కన్నా ఇద్దరికీ కూడా తెలుగు లో మంచి క్రేజ్ ఉండడంతో వీరిద్దరే ఈ మూవీ ని తెలుగు లో ప్రమోట్ చేయడానికి రంగం లోకి దిగారు.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ ఇద్దరు అందగత్తెలు తెలుగులో వరస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ బాక్ మూవీ ని ఫుల్ గా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ సినిమాతో తమన్నా , రాశి కన్నా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి (యు/ఎ) సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ 2 గంటల 28 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: