టీడీపీ గెలవాలని ఆశ పడుతున్న కల్కి నిర్మాత.. కానీ కష్టం?

Purushottham Vinay
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమా పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ అశ్వినీదత్‌ నిర్మించిన ఈ మూవీ షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇక నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వడంతో పాటు  ప్రభుత్వం మారితే సినిమా టికెట్ రేట్స్ ఎలా పడితే ఆలా పెంచుకొనే అవకాశం ఉంటుంది అని  ఆశ పడుతున్నారు ఇండస్ట్రీ జనాలు.ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నా   కల్కి సినిమాకి మాత్రం ఏపీలో ప్రభుత్వం మారాలని గట్టిగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. కల్కి సినిమా నిర్మాత అశ్వినీద్‌ బాహాటంగానే తెలుగు దేశం పార్టీకి మద్దతు పలికిన సంగతి తెల్సిందే. అంతకు ముందు నుంచి కూడా తెలుగు దేశం పార్టీకి అశ్వినీదత్ మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నాడు. పైగా కల్కి సినిమాను ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

కాబట్టి వైకాపా ప్రభుత్వం ఉంటే మాత్రం కచ్చితంగా టికెట్ల రేట్లు పెంచాలి అంటే రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి.అందువల్ల ఏపీలో చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ఏపీలో ప్రభుత్వం మారి తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రావాలని అశ్వినిదత్ కోరుకుంటూ ఉంటాడు. దాంతో ఆ వార్తలు కల్కి సినిమాకు కొంతలో కొంత అయినా ఊరట కలిగిస్తుందని సినీ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారి అంచనాలు తల కిందు అయ్యి, వైకాపా ప్రభుత్వం కనుక మళ్లీ వస్తే మాత్రం కల్కి సినిమాకు కచ్చితంగా కష్టాలు తప్పవు అనేది కొందరి వాదన. తెలంగాణలో టికెట్ల రేట్లతో పోల్చితే ఏపీలో రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఏపీలో ప్రభుత్వం మారాలి, టికెట్ల రేట్లు పెరగాలని ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకున్నారు. అదే జరిగే అవకాశం ఉందని కల్కి ఫిల్మ్‌ మేకర్స్ కూడా ఆశిస్తున్నారు. కానీ అంత సీన్ లేదు. అనేక సర్వేల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: