"సరిపోదా శనివారం" కోసం ఆ ప్రాంతంలో భారీ సెట్..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అని పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ , నాని కి జోడిగా నటిస్తూ ఉండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. కేవలం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాన్ని చాలా గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

అందుకోసం తాజాగా ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ లో భారీ ఖర్చుతో ఓ పెద్ద సెట్ ను వేసినట్లు దాంట్లోనే ఈ మూవీ యొక్క క్లైమాక్స్ సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించబోతున్నారు తెలుస్తోంది. ఇక ఇప్పటికే నాని , వివేక్ ఆత్రేయ కాంబోలో అంటే సుందరానికి అనే మూవీ రూపొందింది.

ఈ మూవీ కమర్షియల్ విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఈ సినిమాలోని నాని నటనకు ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఆత్రేయ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలా అంటే సుందరానికి లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమా తర్వాత వీరి కాంబోలో రూపొందుతున్న మూవీ కావడంతో సరిపోదా శనివారం సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: