వాట్ ఏ కో ఇన్సిడెన్స్.. భార్యభర్తలిద్దరు 99రన్స్ దగ్గర ఆగిపోయారు?

praveen
క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అని పిలుచుకుంటూ ఉంటారు అందరూ. అయితే ఉత్కంఠ భరితంగా జరిగే క్రికెట్ మ్యాచ్ లో ఎన్నో ఫన్నీ సన్నివేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక అంతేకాదు ప్రేక్షకులందరికీ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య కనీసం కన్నారపకుండా చేసే మ్యాచులు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే ఇటీవలే కాలంలో క్రికెట్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతకంతకు పెరిగిపోతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక కొన్ని కొన్ని సార్లు క్రికెట్లో కొన్ని యాదృచ్ఛిక ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఒక ఆటగాడి విషయంలో జరిగిన సంఘటనే ఇక మరో ఆటగాడు విషయంలో కూడా రిపీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటివి జరిగినప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఇదే విషయం గురించి చర్చించుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగా ఒక ఆటగాడికి ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేస్తే అది ఒక ప్రత్యేకమైన ఇన్నింగ్స్ గా నిలిచిపోతూ ఉంటుంది. అలాంటిది ఏకంగా సెంచరీకి చేరువగా వచ్చి 99 పరుగుల దగ్గర ఆగిపోతే ఇక నిరాశ మిగులుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా 99 పరుగుల వద్ద ఆగిపోవడం విషయంలో ఇక్కడ ఇద్దరు ఆటగాళ్లకు ఒకేలాగా జరిగింది.

 ఆస్ట్రేలియా క్రికెట్ జంట మిచెల్ స్టార్క్, అలిస్సా హీలి ఇటీవల అరుదైన ఫీట్ సాధించింది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ హీలి తాజాగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 99 పరుగులు చేసింది. దీంతో సెంచరీ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే సెంచరీకి ఒక్క పరుగుల దూరంలో అవుట్ అయింది. ఆమెకు ఇది 9వ టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. అయితే యాదృచ్ఛికంగా గతంలో స్టార్క్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. తన తొమ్మిదవ టెస్ట్ మ్యాచ్లో సరిగా 99 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక ఈ విషయం తెలిసి వాట్ ఏ కో ఇన్సిడెన్స్.. భార్యాభర్తలిద్దరికీ ఒకేలా జరిగింది అంటూ ఎంతో మంది క్రికెట్ లవర్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: