రోహిత్ అభిమానులకు.. పండగ లాంటి న్యూస్ చెప్పిన జై షా?
కానీ చివరికి ఫైనల్ ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో మాత్రం తడబడింది. దీంతో ఇక రన్నరఫ్ తోనే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఫైనల్ లో ఓడిపోయింది అనే మాటే తప్ప ఇక వరల్డ్ కప్ టోర్నీ మొత్తం టీమిండియా ప్రస్థానం అత్యంత అద్భుతంగా సాగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే ఈ టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మని కెప్టెన్ గా నియమిస్తారా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి టీమిండియాకు టి20 ఫార్మాట్ కి కెప్టెన్గా హార్దిక్ పాండ్యానే నియమిస్తూ వస్తుంది బీసీసీఐ.
ఇక రోహిత్ కూడా టి20 ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడు. మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టి20 సిరీస్ లో 14 నెలల గ్యాప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో మ్యాచ్లు ఆడాడు రోహిత్ శర్మ. అయితే టి20 వరల్డ్ కప్ కి కూడా హార్దిక్ పాండ్యా కెప్టెంబర్ నియమించే అవకాశం ఉంది అని వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి వార్తలు నేపథ్యంలో రోహిత్ శర్మను టి20 ఫార్మాట్ కెప్టెన్ గా కొనసాగిస్తారా లేదా అనే విషయంపై మాత్రం సందిగ్ధత నెలకొంది. ఇక ఈ సమయంలో అటు రోహిత్ శర్మ అభిమానులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు బిసిసిఐ సెక్రెటరీ జై షా. టి20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టేసాడు. ఇటీవల ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ. రోహిత్ సారధ్యంలో భారత్ 2024 t20 వరల్డ్ కప్ గెలుస్తామనే నమ్మకం మాకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రోహిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.