రింకు అవసరం.. టీమిండియాకు ఉంది.. రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయిన ఆటగాడు ఒకే ఒక్కరు. అతను ఎవరో కాదు సిక్సర్ల  వీరుడు రింగ్ సింగ్. గత ఐపీఎల్ సీజన్లో సూపర్ ఇన్నింగ్స్ తో ఒక్కసారిగా భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అతని ఆట తీరుతో  ప్రేక్షకుల హృదయాలను గెలిచేసాడు  కేవలం ఒక్క మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు. తర్వాత మ్యాచ్ లలో చూద్దాం అతనిలా రాణిస్తాడో అని అనుకున్నారు అందరూ. కానీ ఆ తర్వాత మ్యాచ్లలో కూడా అతని విధ్వంసం అలాగే కొనసాగింది. దీంతో సెలెక్టర్లు చూపు అతని వైపు మళ్ళింది  ఇక వెంటనే భారత జట్టులో కూడా అతనికి చోటు కల్పించారు.

 టీమిండియాలోకి వచ్చిన తర్వాత కూడా అతని ఆటతీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో రింకు లాంటి క్రికెటర్లను ఎంతోమందిని చూశాం. ఎవరైనా సరే ఒత్తిడికి చిత్తు అవ్వాల్సిందే అనుకున్నారు చాలామంది. కానీ ఊహించని రీతిలో అతను విధ్వంసకర ఆట తీరుతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఇక ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాడు రింకు సింగ్. గత కొన్ని రోజుల నుంచి టి20 ఫార్మాట్లో అతని అతని బ్యాట్ నుండి వస్తున్న మెరుపు ఇన్నింగ్స్ లను ప్రేక్షకులు అస్సలు మరిచిపోరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 ఇక ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టి20 మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేయగా.. అదే తరహాలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు రింకు సింగ్. ఈ క్రమంలోనే ఈ యంగ్ బ్యాట్స్మెన్ పై కెప్టెన్ రోహిత్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియాకు రింకు సింగ్ అవసరం ఉంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకుచ్చాడు. రింకు తనదైన ప్రదర్శనతో తాను బ్యాట్ తో ఏం చేయగలడో చూపించాడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతని బలం అతనికి బాగా తెలుసు. జట్టుకు కావాల్సింది ఇస్తున్నాడు. జట్టును గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు అంటూ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: