వారెవ్వా.. ఒక్క మాటతో ధోని అభిమానుల మనసు దోచిన రింకు?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయిన క్రికెటర్ ఎవరు అంటే రింకు సింగ్ అనే చెప్పాలి. కాగా గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ సమయంలో అతను ఆడిన ఒకే ఒక మెరుపు ఇన్నింగ్స్ తో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు. అంతేకాదు సెలెక్టర్ల చూపులు కూడా ఆకర్షించి వెంటనే భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీం ఇండియాలోకి వచ్చిన తర్వాత కూడా అదే రీతిలో విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడుతూ ఇక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు.

 ఈ క్రమంలోనే భారత జట్టును ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న ఫినిషర్ పాత్రకు తానే సరైన ఆటగాడిని అన్న విషయాన్ని రింకు సింగ్ అందరికీ అర్థమయ్యేలా చేశాడు అని చెప్పాలి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా మంచి ప్రదర్శన చేసి భారత జట్టుకు రేపటి ఫ్యూచర్ స్టార్ అతనే అన్న నమ్మకాన్ని అందరిలో కలిగించాడు. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన ఇన్నింగ్స్ లతో భారత క్రికెట్ ప్రేక్షకులలో కూడా ఇక నమ్మకాన్ని సంపాదించుకోగలుగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 టీమిండియాలో ఫినిషర్ రోల్ లో ఆడటం తనకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. నేను మహి బాయ్ తో మాట్లాడాను. బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండాలని బంతిని బట్టి రియాక్ట్ అవ్వాలి అంటూ సూచించాడు. అయితే నేను కూడా అలాగే ఆడాలి అనుకుంటున్నాను. ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేయడం మ్యాచ్లను ముగించడం అలవాటుగా మారిపోయింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా ఆలోచించను. బంతి ఎలా వస్తుంది అనే విషయం పైన దృష్టి పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు రింకు సింగ్. అయితే తాను ఆడిన ఇన్నింగ్స్ లపై గొప్పలకు పోకుండా క్రెడిట్ మొత్తం ధోని కి ఇచ్చినట్లుగా రింకు మాట్లాడటంతో ఇక మహి అభిమానులు ఫీదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: