నేడే రెండో టెస్ట్.. టీమిండియా ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్?

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది. ఇప్పటికి పరిమిత ఓవర్ల  ఫార్మాట్ లో సిరీస్లను ముగించుకున్న టీమ్ ఇండియా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో మొదటి అడుగులోనే టీం ఇండియాకు చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా సౌత్ ఆఫ్రికా జట్టు చేతిలో దారుణమైన పరాజయాన్ని చవి చూసింది టీమిండియా. 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.

 అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమితో ఇక సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ను గెలుచుకోవాలి అన్న కల టీం ఇండియాకు కలగానే మిగిలిపోయి అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓటమితో ఇక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. బ్యాటింగ్ విభాగం లో బౌలింగ్ విభాగంలో పూర్తిగా తేలిపోయిన భారత జట్టుపై ఎంతోమంది మాజీ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇక మొదటి మ్యాచ్ ఓటమి నుంచి తేరుకొని ఇక ఇప్పుడు రెండో మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది టీం ఇండియా. ఇక నేడు రెండో టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

 కేప్ టౌన్ వేదికగా ఈ రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ టెస్ట్ సమరం ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇక ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. ఇక మొదటి మ్యాచ్ లో ఓటమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా రెండో మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవడమే కాదు సిరీస్ ను సమం చేయాలని భావిస్తుంది  ఈ క్రమంలోనే జట్టులో జడేజా స్థానంలో అశ్విన్ ప్రసిద్ కృష్ణ స్థానంలో ఆవేష్ ఖాన్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేప్ టౌన్ వేదికగా ఇప్పటివరకు అటు భారత జట్టుకు మంచి రికార్డులు లేకపోవడం గమనార్హం. ఏం జరుగుతుందో అని టీమ్ ఇండియా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: