భారత్ ను కట్టడి చేసిన కివీస్ బౌలర్లు...
అయితే చివరి వరకు నాటౌట్ గా ఉన్న రవీంద్ర జడేజా 19 బంతుల్లో 26 పరుగులు చేయడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేయగలిగింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీయగా.. ఇష్ సోధీ రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే ఒక్కో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 111 పరుగులు చేయాలి. అయితే లక్ష్యం చిన్నది కావడంతో మన భారత బౌలర్లు దానిని కాపాడగలరు అనేదే ప్రశ్న. అయితే ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందో ఆ జట్టుకు సెమీస్ లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అనేది తెలిసిందే. ఓడిన జట్టు దాదాపు టాప్ 2 పైన ఆశలు వదులుకోవాల్సిందే.