మహిళలేని మంత్రివర్గం - సచివాలయానికి రాని సిఎం - దేశంలో కెసీఆర్ ఒక్కరే!

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టి, ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో కలిసి పోయిన పార్టీటీడీపీ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఆరోపించారు. అలాగే సొంత పార్టీకి చెందిన తెలంగాణాలో జన్మించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియలు కూడా సరిగ్గా చేయని చేయనివ్వని పార్టీ కాంగ్రెస్‌ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి దురాగత పార్టీల ఐఖ్యత రాష్ట్రానికి ఏం మేలు చేస్తాయో చెప్పలేమని అన్నారు.

నగరంలోని ముషీరాబాద్‌ లో శుక్రవారం జరిగిన బీజేపీ యువ భేరీ సదస్సులో పాల్గొన్న మీనాక్షి మాట్లాడుతూ, కొన్ని రాజకీయ పార్టీలు కాకుండా కొన్ని కుటుంబాల కలయిక గా ఆమె మహాకూటమని గాంధి చంద్రబాబు కుటుంబాలను ఉద్దేశించి వర్ణించారు.

చాయ్‌ అమ్మిన అతి సాధారణ వ్యక్తిని ప్రధానిని చేసిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. రైతు లకు భీమా, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి గొప్ప పథకాలను ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలుచేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర పథకాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు.

హైదరాబాద్‌ ప్రాంతాన్ని భారత యూనియన్‌ లో విలీనం చేసిన ఘనత సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌కే దక్కుతుందని ఆమె గుర్తు చేశారు. దక్షిణ భారతం లో తినడానికి తిండి కూడా దొరకదని పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. బీజేపీ మద్దతు తెలపడం తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సచివాలయానికే రాకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో ఆకాశంలో సగమన్న మహిళలకు ఒక్కరికైనా అవకాశం యివ్వని మంత్రిమండలి  కెసీఆర్ దే నని అన్నారు.

కేవలం తన కూతురును పార్లమెంట్ సభ్యురాలిని చేసి మహిళలకు స్థానమిచ్చానని అనుకుంటూ కేసీఆర్ తన కుమారునికి మేనల్లునికి అధికారం పంచుతూ కుటుంబ పాలన చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి చంద్రబాబు తీరు అసాధారణమని ఆయన్ని చూసి టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. 

ఎన్ టి ఆర్ అన్నట్లు ఈ వరసలో రాహుల్ గాంధి కుక్కమూతి పిందే కదా! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: