దిగి రాక తప్పలేదు! బెంగాల్ లో మమత క్రేజ్ మసకబారుతోందా?

Chakravarthi Kalyan

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖ నేతలకు ఒక్కోసారి ఏమవుతుంది. వయసు పెరిగేకొద్దీ.. అనుభవం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో సంక్షోభంలో ఎలా రియాక్ట్ కావాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదేం చిత్రమో కానీ.. 2011 నుంచి నాన్ స్టాఫ్ గా సీఎంగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ కి ఎప్పుడు ఎలా వ్యవహరించాలి? ఎలాటి పరిస్థితులన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి వంటి విషయాల్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


అలాంటి ఆమె.. ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పీజీ వైద్య విద్యార్థిని దారుణ హత్యోదంతం అంశంపై స్పందించిన తీరు అర్థం చేసుకోనట్లుగా మారింది. కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యతల విషయంలో తప్పులు జరగొచ్చు. కానీ ఆ విషయాన్ని గుర్తిచడానికి ఒకట్రెండు రోజులు సమయం పడుతుంది. లేదంటే మరో రోజు అదనం పడుతుంది. కానీ వారాల తరబడి సాగుతున్నా ఆమె రియాక్టు అయిన తీరు షాకింగ్ గా మారింది.


రాష్ట్ర రాజధానిలోని ఓ ఆసుపత్రిలో జూనియర్ డాక్టరపై చోటు చేసుకున్న హత్యాచారంపై నెల రోజుల పైనే వైద్య విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఒక సీఎంగా వ్యవహారించాల్సిన తీరు ఎలా ఉండాలి? ఎంత త్వరగా రియాక్టు కావాలి? కానీ ఇవేమీ కనిపించవు. ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థుల్ని తన వద్దకు పిలిపించుకున్న సీఎం మమతా బెనర్జీ సమస్యను కొలిక్కితీసుకొచ్చే విషయంలో ఫెయిల్ అయ్యారు. వారిని అదే పనిగా పిలవడం, పంపడం లాంటి వాటితో మరింత డ్యామేజ్ చేసుకున్నారు. చివరకు సోమవారం రాత్రి చర్చల కోసం పిలిచిన ఆమె ఎట్టకేలకు వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు.


ఇందులో భాగంగానే కోత్ కతా నగర్ పోలీస్ కమిషనర్ గా వినీత్ గోయల్ ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లుగా ప్రకటించారు. సీఎం నివాసంలో దాదాపు ఆరు గంటల పాటు వైద్య విద్యార్థులు టీం కలిసి భేటీ అయిన ఆమె.. చివరకు వారి డిమాండ్లకు తలొగ్గారు. మరి ఇదే నిర్ణయాన్ని మొదటి నాలుగైదు రోజుల్లోనే చేసి ఉండొచ్చు. అలా అయితే ఆమె ఇమేజ్ డ్యామేజ్ కొంతమేర తగ్గేదే అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: