పాపం కేసీఆర్... నాలుగో రోజు కూడా ప్రధాని దర్శనం లేనట్లే....!
వాస్తవానికి ఈ సారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కో భేటీ అయ్యేందుకు కేసీఆర్ గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే నాలుగు రోజులు గడిచినప్పటికీ... ఇప్పటి వరకు వీరితో కేసీఆర్ సమావేశం కాలేదు. నాలుగు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన కార్యాలయంలోనే ఉన్నారు. ఏ పర్యటన చేయలేదు. ఈ రోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణ, కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, క్రిప్టో కరెన్సీ పై బిల్లు, వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని శాఖల మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయినా సరే... ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. అయినా తెలంగాణ మంత్రుల బృందం మాత్రం కేంద్ర పెద్దల సంప్రదింపుల కోసం ఎదురు చూస్తోంది. ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపేందుకే కేసీఆర్, మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది. అలాగే యాసంగి వరి పంట గురించి కూడా ప్రధానితో చర్చలు జరుపుతామని కేసీఆర్ వెల్లడించారు. కానీ పీఎంవో మాత్రం ఇప్పటి వరకు కేసీఆర్కు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.