పదవుల కోసం కక్కుర్తి పడని రోశయ్యకు పిలిచి మరీ సీఎం పదవి ఇచ్చిన వైనం..!
ఆ తర్వాత రోశయ్య కు 2004 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు ఆర్థిక మంత్రి పదవి చేపట్టారు. సోనియా తర్వాత వైఎస్ మరణాంతరం ఎందరో సీనియర్లు ఉన్నా కూడా రోశయ్యనే ముఖ్యమంత్రిని చేసింది. నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా ఉంది. ఆ సమయంలో తెలంగాణ కు చెందిన ఎందరో సీనియర్లు తమకు ముఖ్యమం త్రి పదవి కావాలని పట్టుబట్టారు. అయితే చివరకు సోనియా మాత్రం రోశయ్య అయితే నే ఆ సమయంలో ప్రభుత్వం తో పాటు పార్టీని నడుపుతారని భావించి ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు.
ఇక రోశయ్య ఇన్నేళ్ల ప్రస్థానంలో ఏ నాడు కూడా పదవుల కోసం పాకులాడ లేదు. ఆయనకే పిలిచి మరీ పదవులు ఇచ్చారు. ఇక రోశయ్య పార్థీవ దేహాన్ని ఈ రోజు అమీర్ పేటలో ఆయన స్వగృహానికి తరలిస్తారు. ఇక పార్టీ నాయకులు, అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో గాంధీ భవన్ లో ఉంచి.. అక్కడ నుంచే నేరుగా మహా ప్రస్థానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు... రోశయ్య అసమాన్యమైన వ్యక్తి అని కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఆయన తనకు పెదనాన్న లాంటి వారు అని ఆయనతో అనుబంధం గుర్తు చేసుకున్నారు.