మాజీ పోర్న్ స్టార్ , ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కు జోడిగా నటిస్తున్నాడు తెలుగు యువ నటుడు నవదీప్. అయితే వీరద్దరూ కలిసి నటిస్తుంది సినిమాలో కాదు, రాగిణి ఎంఎంఎస్ 2 అనే వెబ్ సిరీస్ లో.. ఇటీవలే ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా నవదీప్ ఈ షూటింగ్ లో జాయిన్అయ్యాడు. ఈసందర్బంగా సెట్ లో నవదీప్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి .. నవదీప్ తో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. అతనొక మంచి వ్యక్తి అని సన్నీ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఇక ఈ సిరీస్ తో పాటు సన్నీ, కామసూత్ర అనే వెబ్ సిరీస్ లో కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత , దర్శకురాలు ఏక్తాకపూర్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. గతంలో వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన రాగిణి ఎంఎంఎస్ సూపర్ హిట్ అయ్యింది.
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా సోలో హీరో గా సినిమాలు చేయడం మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతున్నాడు నవదీప్. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్' అల... వైకుంఠపురములో' అనే చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం నవదీప్ కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇక ఆయన తెలుగు లో ఈ సినిమా కు తప్ప ఇప్పటివరకైతే మరో సినిమాకు సైన్ చేయలేదు.