'భీష్మ' వీళ్లను ఏమి చేస్తాడో ?
'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా 'భీష్మ' చిత్రం ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని.. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలోనే హైలెట్ గా నిలవబోతుందని తెలుస్తోంది. మొత్తానికి వెంకీ కుడుముల 'ఛలో' మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడట. ఇక ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హెబ్బా పటేల్ పాత్ర బాగా బోల్డ్ గా ఉంటుందట. హెబ్బా - నితిన్ రొమాన్స్ కూడా సినిమాలో హైలెట్ నిలుస్తోందని చెబుతుంది చిత్రబృందం.
అయితే ఈ మధ్య ఛాన్స్ లు లేక కష్టాల్లో పడిన హెబ్బాకి ఈ సినిమాతోనైనా ఆమె ఆశించిన బ్రేక్, ఆమెకు దక్కుతుందేమో చూడాలి. అలాగే నితిన్ కూడా భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన మెయిన్ హీరోయిన్ గా రష్మిక మండన్నా నటిస్తోంది. ప్రస్తుతం నితిన్, 'భీష్మ'తో పాటు వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలోనూ అలాగే విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వీళ్లను 'భీష్మ' ఏమి చేస్తాడో ?