"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చాక ట్రోల్స్ కి గురవుతున్న "ది ఫ్యామిలీ మ్యాన్" మూవీ..?

MADDIBOINA AJAY KUMAR
విజయ్ దేవరకొండ తాజాగా ది ఫ్యామిలీ మెన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పరుశురామ్ పేట్ల దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో గీత గోవిందం అనే బ్లాక్ బాస్టర్ మూవీ రూపొందడంతో ఈ కాంబో అనౌన్స్ అయిన వెంటనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... జగపతి బాబు ఈ మూ వీలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ మూవీ ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి పెద్ద మొత్తంలో కలెక్షన్ లు రాలేదు. చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నష్టాలను చవి చూసింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చాక భారీ ఎత్తున ట్రోలింగ్ కి గురవుతోంది.

ఇక సినిమా థియేటర్ లలో ఉన్న సమయం లోనే ఈ మూవీ లోని దోష సన్నివేశం చాలా ఫన్నీగా ఉంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇక "ఓ టి టి" లోకి వచ్చాక ఈ దోష సన్నివేశంకు సంబంధించిన స్క్రీన్ షాట్ కి ఫన్నీ వ్యాఖ్యలను జోడిస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ చిన్నపిల్లలకు పలుచటి దోషాలను వేస్తాడు. అది ఫన్నీగా ఉంది అంటూ ఎంతో మంది మధ్య తరగతి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఎంత మధ్య తరగతి వాళ్ళు అయినా కూడా ఇలాంటి దోషాలు ఎవరు వేసుకోరు , తినరు అంటూ ఈ సన్నివేశాన్ని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: