"రత్నం" ను డామినేట్ చేస్తున్న "గిల్లి"..?

MADDIBOINA AJAY KUMAR
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ చాలా సంవత్సరాల క్రితం గిల్లి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 20 వ తేదీన తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీస్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుంది. 

దానితో ఇప్పటికే ఈ మూవీ సౌత్ లో ఏ సినిమా కూడా రీ రిలీజ్ లో భాగంగా సాధించని కలెక్షన్ లను సాధించింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా తమిళ నాడులో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశాల్ తాజాగా హరి దర్శకత్వంలో రూపొందిన రత్నం అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఈ మూవీ ఏప్రిల్ 26 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన తర్వాత గిల్లి మూవీ ప్రభావం తమిళ నాడు లో పూర్తిగా తగ్గిపోతుంది అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే రత్నం మూవీ కంటే కూడా గిల్లి కే తమిళ ప్రేక్షకుల నుండి ఎక్కువ రెస్పాన్స్ రావడం జరుగుతుంది. ఇకపోతే తాజాగా రత్నం మూవీ కి సంబంధించిన 33 వేల టికెట్లు అమ్ముడుపోగా , గిల్లి మూవీ కి సంబంధించిన 36 వేల టికెట్లు ఒక రోజు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇలా లేటెస్ట్ రిలీజ్ అయిన రత్నం మూవీ కంటే కూడా రీ రిలీజ్ అయిన గిల్లి పైనే తమిళ ప్రేక్షకులను ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: