కడప: సంచలన సర్వే.. ప్రజలంతా ఆ పార్టీ వైపేనా.?
బద్వేల్:
కూటమి అభ్యర్థిగా బొజ్జ రోషన్న బరిలో ఉండగా, దాసరి సుధా వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. ఈసారి బద్వేల్ లో తప్పక వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేస్తుందని సర్వేలో తేలింది.
రాజంపేట:
కూటమి అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేయగా, వైసిపి నుంచి ఆకేపాటి అమర్నాథ్ బరిలో ఉన్నారు. ఈసారి రాజంపేటలో కూటమి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది.
కోడూరు:
ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. కూటమి నుంచి అరవ శ్రీధర్ బరిలో ఉండగా, కురుమట్ల శ్రీనివాసులు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు మధ్య చాలా హోరాహోరీ పోటీ ఉంది.
రాయచోటి:
కూటమి అభ్యర్థిగా ఏం రాంప్రసాద్, వైయస్సార్సీపి నుంచి శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అని రాయచోటి ప్రజలంతా వైయస్సార్సీపీకే ఎక్కువగా మొగ్గు చూపే విధానం కల్పిస్తోంది.
జమ్మలమడుగు:
కూటమి తరపున ఆదినారాయణ రెడ్డి బరిలో ఉండగా, వైయస్సార్సీపి నుంచి డాక్టర్ సుధీర్ రెడ్డి కాంటెస్ట్ లో ఉన్నారు. ఇద్దరు మధ్య హోరాహోరీ పోటీ ఉంది.
కడప:
కడప టౌన్ లో మాధవి రెడ్డి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. వైయస్సార్సీపి నుంచి భాషా భాయ్ పోటీ చేస్తున్నారు. కానీ గెలిచేది వైసిపి అభ్యర్థి అని ఇప్పటికే తేలిపోయింది.
కమలాపురం:
కూటమి తరపున చైతన్య రెడ్డి బరిలో ఉండగా, వైసిపి నుంచి రవీంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంది.
పొద్దుటూరు:
కూటమి నుంచి వరదరాజుల రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి రచ్చ మల్లు శివప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య కూడా నువ్వా నేనా అనే విధంగా ఫైట్ ఉంది.
మైదుకూరు:
కూటమి అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ పోటీలో ఉన్నారు. వైసిపి నుంచి రఘురాం రెడ్డి బరిలో ఉన్నారు. వీరి మధ్య కూడా విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టంగా మారింది.
పులివెందుల:
ఇక కడప జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం పులివెందుల. ఇక వైసిపి నుంచి జగన్మోహన్ రెడ్డి. కూటమి అభ్యర్థిగా రవీంద్రనాథ్ బరిలో ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో ఇక్కడ గెలుస్తారు.