టార్గెట్ పిన్నెల్లి : ఒక్కడి కోసం టీడీపీ నేతల రచ్చ ఎందుకయ్యా..?
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... ధ్వంసం చేసిన ఈవీఎం బాక్స్లకు సంబంధించిన వీడియో మాత్రమే వైరల్ అయింది. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ కాలేదని సాటి తెలుగు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హైదరాబాదులో దాక్కున్నారట. ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే ఛాన్స్ ఉంది.
ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని తెలుగు ప్రజలు అంటున్నారు. పిన్నెల్లి రామకృష్ణ చేసిన నేరం నేపథ్యంలో... ఇవాళ చలో మాచర్ల నియోజకవర్గానికి పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా దేవినేని ఉమా, బోండా ఉమా, వర్ల రామయ్య లాంటి నేతలు అందరూ మాచర్ల నియోజకవర్గానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలు... మాచర్ల నియోజకవర్గానికి వస్తే... గొడవలు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.
ఇలాంటి నేపథ్యంలో... పోలీసులు అలర్టై... వారిని అరెస్టు చేస్తున్నారు. అయితే ఈ తెలుగుదేశం పార్టీ నేతల హడావిడి నేపథ్యంలో... తెలుగు ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక్కడి కోసం... తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలందరూ దిగాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు తెలుగు ప్రజలు. చిన్న వివాదాన్ని మరింత పెద్దగా చేసే విధంగా తెలుగుదేశం నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి... ఇంకా పెద్దది చేస్తున్నారని సాటి తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు.