ఏపీ : పవన్ కోసం కదులుతున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్స్..!
పవన్ కళ్యాణ్ ని కలిసే వారిలో అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ,రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.పవన్ కళ్యాణ్ గెలిచినందుకు సినీ పరిశ్రమలోని ఓ స్టార్ నిర్మాత, పవన్ కళ్యాణ్ సన్నిహిత వ్యక్తి భారీగా ఓ పార్టీ నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని ఓ పెద్ద కన్వెన్షన్ సెంటర్ లో ఆ నిర్మాత సినీ పరిశ్రమలోని ప్రముఖులకు, సినీ మీడియా వ్యక్తులకు ఈ పార్టీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఏపీలో ఇటీవల పవన్ కళ్యాణ్ గెలవడంతో పటు తన జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపించుకోవడంతో అభిమానులు కార్యకర్తలు ఆనందంలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. వీరితో పాటు సినీ పరిశ్రమకు సన్నిహితంగా ఉండే పలువురు కూడా ఈ ఎన్నికల్లో గెలవడంతో సినీ పరిశ్రమ సంతోషంలో ఉంది. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి అనేక మంది నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక సిబ్బంది ఏపీ ఫలితాలపై శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేసారు.ఇక పలువురు సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని కలిసి అభినందించారు.