హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదుగుతున్నది. డీజే తరువాత ఈ అమ్మడికి అవకాశాలు వరసగా రావడం మొదలుపెట్టాయి. అరవింద సమేత సినిమాతో అఫీషియల్ గా హిట్ కొట్టింది. దీని తరువాత మహర్షి సినిమాతో మరో హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తున్నది.
అటు బాలీవుడ్ లో వరస సినిమాలతో దూసుకుపోతున్నది. సినిమాకు సైన్ చేసే సమయంలో కొన్ని కండిషన్స్ పెడుతుందట ఈ అమ్మడు. ఆ కండిషన్స్ ఏమంటే.. సెట్స్ లో ఉండగా సీరియస్ గా ఉండకూడదు. జాలిగా ఎంజాయ్ చేసుకునే విధమైన వాతావరణం ఉండాలి.
పూజా పెడుతున్న కండిషన్స్ ఇవేనట. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులతో సినిమాలు చేయాల్సి వస్తుంది. సెట్స్ లో ఉన్నప్పుడు కూడా సరదాగా లేకుండా సీరియస్ గా ఉంటె ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్క్ సరిగా చేయలేరు.
అందుకే పూజా హెగ్డే సెట్స్ లో సరదా వాతావరణం క్రియేట్ చేయాలని అలా చేస్తేనే సినిమాల్లో నటించేందుకు సైన్ చేస్తానని అంటోందట. ఇది సిల్లీగానే ఉండొచ్చు. ఒత్తిడి వాతావరణంలో పనిచేసే వాళ్లకు ఇది చాలా రిలీఫ్ గా ఉంటుంది.