ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ కొత్త హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న హీరో ఎన్టీఆర్.  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ చిత్రంతో మంచి విజయం సాధించిన ఎన్టీఆర్ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ విజయం సాధించాడు.  ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్.  అంతే కాదు మొదటి సారిగా చాలా పవర్ ఫుల్ నెగిటీవ్ పాత్రలో కూడా కనిపించబోతున్నాడట.

 ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని తెలియగానే ప్రేక్షకుల్లో, ఆయన అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. అంతేకాకుండా హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేస్తుండటంతో సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అనే అంచనాలు కూడా పెరిగిపోయాయి.  ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఓకే అయిన విషయం తెలిసిందే..అయితే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుందట.

ఇప్పటికే రాశి ఖన్నా, నివేత థామస్ లు ఇండియాలో హీరోయిన్లుగా కుదరగా నందిత రాజ్ కూడా ఇందులో నటిస్తోందని తెలుస్తోంది. అంతే కాదు తనకు సంబంధించిన పాత్ర తాలూకు సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తైపోయిందట. సినిమాలో ఈమెది చిన్న పాత్రే అయినప్పటికీ కథకు కీలకంగా, ప్రేక్షకులకు సప్రైజింగా ఉంటుందని, అందుకే ఆమె పాత్రను గోప్యంగా ఉంచారని సినీ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: