ఎన్టీఆర్ కొత్త ఆలోచన.. వర్క్ అవుట్ అవుతుందా...?

Shyam Rao
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోగా పేరుగాంచిన నటుల్లో జూనియర్ ఎన్ఠీఆర్ ఒకరు. అయితే ఈయన తీసింది కొన్ని సిమాలే అయినా వాటి ద్వారా తెలుగు ప్రజల విశేష ఆధారాభిమానాల్ని చూరగొన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ గమనించవల్సిన ప్రధాన విషయం ఏంటంటే, తారక్ తీసిన సినిమాల్లో సగానికి పైగా ఫట్ అయినవే. అయినా నటనలో లోపాలను మెరుగులు దిద్దుకుంటూ అద్భుతమైన విజయం కోసం ఆయన ఎదురుచూస్తూనే ఉన్నారు.



మొదట్లో జనతా గ్యారేజ్ సినిమాపై కొన్ని ప్రతికూల వార్తలు వినిపించినా రాను రాను ప్రజలు జనతా గ్యారేజీ సినిమా పట్ల ఆకర్షితులయ్యారు. సామాజిక నేపథ్యం ఉన్న కథను తెరపైకి ఎక్కించడంలో నిష్ణాతుడు అని పేరుతెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ ఈ కథను తెరపై అద్భుతంగా చూపించారు. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నిర్మించిన శ్రీమంతుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ప్రజలు కొరటాల శివ దర్శకత్వం పై కొన్ని ఊహాగానాలు ఏర్పరుచుకున్నారు. 



అయితే ఈ సినిమా వారి అంచనాలకు అందడంతో, పైగా తారక్ నటన అద్భుతంగా ఉండడంతో సినిమా హిట్ టాక్ వచ్చింది. ఇటీవల విడుదలైన 'జనతా గ్యారేజ్' సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగా టాలీవుడ్ టాప్ త్రీ మూవీస్ లో స్థానాన్ని కూడా దక్కించుకుంది. ఈ విజయంతో ఎన్టీఆర్ ఇమేజ్ ఎంతగానో పెరిగిపోయింది. అలాగే బిజినెస్ పరంగా ఆయన మార్కెట్ కూడా మరింత విస్తృతమైంది. 



దీంతో దీనిని మరింతగా పెంచుకునే ప్రయత్నంలో ఇప్పుడు ఎన్టీఆర్ వున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కేరళతో పాటు జపాన్ లో కూడా మార్కెట్టును సంపాదించుకున్న యంగ్ టైగర్, ఇప్పుడు తమిళ మార్కెట్టుపై కూడా దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రాలను ప్లాన్ చేసుకునే ఉద్దేశంలో ఆయన ఉన్నాడట. వీటికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: