మళ్లీ కలిసిపోతున్న ధనుష్ ఐశ్వర్య.. కానీ ఓ కండిషన్.?

Pandrala Sravanthi
మన టాలీవుడ్ హీరోల్లాగా కోలీవుడ్ హీరోలు అందరికీ సిక్స్ ప్యాక్ బాడీ ఏమి ఉండదు. అయినా ఆ హీరోలు  కేవలం నటనతోనే స్టార్లుగా మారుతూ ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధనుష్. చూడటానికి సన్నగా కరెంటు తీగలా ఉన్నా దీనమ్మ ముట్టుకుంటే షాకే అన్నట్టుగా ఆయన నటన ఉంటుంది.  ఆ విధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ధనుష్. సినిమాల పరంగా ఆయన స్టార్ గా మారారు. కానీ తన సొంత లైఫ్లో మాత్రం కాస్త  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నారని 2022లోనే అనేక వార్తలు వినిపించాయి. ఆ వార్తలు బయటకు వచ్చిన మాదిరిగానే వీరిద్దరు విడిపోయి సెపరేట్ గా జీవిస్తున్నారు. వీరి విడాకులకు కారణం ఒక హీరోయిన్ అని ఇప్పటికీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.  

అయితే వీరిద్దరి డైవర్స్ కేసుకు సంబంధించి కోర్టు ఏప్రిల్ లోనే నోటీసులు జారీ చేసింది. అంతేకాదు అక్టోబర్ 7వ తేదీన విచారణ ఉన్నదని తెలియజేసింది. ఇక వీరిద్దరూ కలిసి అక్టోబర్ 7న విచారణకు హాజరవుతారని అప్పుడే విడిపోతారని అందరూ భావించినా కానీ 7వ తేదీన ఉన్నటువంటి వాయిదాకు  వీరిద్దరూ కోర్టుకు హాజరు కాకపోవడంతో అందరూ షాక్ అయిపోయారు..  ఇద్దరు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ డేట్ ను అక్టోబర్ 19కి వాయిదా వేసింది కోర్టు. అయితే అక్టోబర్ 7న ధనుష్ ఐశ్వర్య కోర్టుకు రాకపోవడంతో దాని వెనుక కారణమేమై ఉండొచ్చా అని ఫ్యాన్స్ చెవుల కొరుక్కుంటున్నారు. వీరిద్దరూ మళ్లీ కలిసిపోతారా.. మనసు మార్చుకొని ఒక్కటవుతారా..

ఈరోజు కోర్టుకు రాకపోవడం చూస్తే మాత్రం అలాంటిదే ఏదో ఉందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా పిల్లల కోసం వీరిద్దరూ మళ్లీ మనసు మార్చుకున్నారని మళ్ళీ కలవబోతున్నారని ఓపక్క  అభిమానులు అనుకుంటున్నారు. అందరూ అనుకున్నట్టుగానే వీరు మళ్ళీ కలిస్తే మాత్రం  ధనుష్, రజినీకాంత్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. ఒకవేళ కలిస్తే ఒకరి లైఫ్ లో ఒకరు తొంగి చూడకుండా ఎవరి లైఫ్ వారిది అనే కండిషన్ ల మీద కలుస్తారు కావచ్చు అని నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: