స్పిరిట్ ను పక్కన పెట్టి ఆ సినిమాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్న డార్లింగ్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి 2898 ఎడి  సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. దిశా పటాని, దీపికా పదుకొనే, కమలహాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటినటులు ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. సౌత్ లోనే కాకుండా ఈ సినిమా నార్త్ లో కూడా భారీ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఏకంగా 1000 కోట్ల కలెక్షన్ ను రాబట్టగా. బాక్స్ ఆఫీస్ వద్ద సరీ కొత్త రికార్డు క్రియేట్ చేసింది  . ఇదిలా ఉండగా ప్రభాస్

 చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్పుడే సినీ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతోపాటు ఈ స్టార్ హీరో హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాలో కూడా నటించబోతున్నాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు తన మొట్టమొదటగా స్పిరిట్ సినిమాని స్టార్ట్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. కానీ ఇంకా ఆ సినిమాకి  సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుందట.

 దాంతో ప్రభాస్ ఇప్పుడు హను రాఘవపూడి తో కలిసి సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. ఇక సినిమా షూటింగ్ అక్టోబర్ లో మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్  సిద్ధమవుతుందట. ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ 2025 ప్రథమార్ధంలో ప్రారంభించాలని  ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా 1940 నేపథ్యంలో సాగే కథగా   తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ ప్రభాస్ సరసన నటిస్తోంది. అయితే ప్రభాస్ ఇప్పుడు నిజంగానే ఫౌజీ సినిమా కు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా.. స్పిరిట్ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తాడా అనే విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: