"రత్నం" కి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశాల్ పోయిన సంవత్సరం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మార్క్ ఆంటోనీ అనే సినిమాలో హీరో గా నటించిన సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా మార్క్ ఆంటోనీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత విశాల్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరు అయినటువంటి హరి దర్శకత్వంలో రూపొందిన రత్నం అనే మూవీ లో హీరో గా నటించాడు.

గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సినిమాలు బ్లాక్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు సాధించి ఉండడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి తమిళ్ లో ఇటు తెలుగు లో రెండు ప్రాంతాల్లో కూడా భారీ కలెక్షన్ లు దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటిబ్వరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

రెండు రోజుల్లో ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల రేంజ్ లో షేర్ ... 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి రెండు రోజుల్లో చాలా తక్కువ కలెక్షన్ లు దక్కాయి అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ప్రస్తుతం అందుకుంటున్న కలెక్షన్ లని బట్టి చూస్తే భారీ కలక్షన్ లను వసూలు చేసే అవకాశాలు చాలా తక్కువ స్థాయిలో కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: