"ఐపీఎల్ 2024" లో ఆ మూడు జట్ల పానైపోయింది..?

Pulgam Srinivas
దాదాపు నెల రోజుల క్రితం (ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో కొన్ని జట్లు భారీ అంచనాల నడుమ ఈ సీజన్ లోకి అడుగుపెట్టి ప్రేక్షకుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా తమ అద్భుతమైన ఆట తీరుతో ఇప్పటికే పాయింట్ల పట్టికలో మంచి స్థానంలో ఉన్నారు. ఇక కొన్ని జట్లు మాత్రం మంచి అంచనాల నడుమ సీజన్ లోకి అడుగు పెట్టినప్పటికీ ప్రేక్షకులను మరియు తమ జట్టు అభిమానులను ఎంతగానో నిరుత్సాహ పరిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండడం మాత్రమే కాకుండా ఈ సీజన్ లో ప్లే ఆప్స్ ఆశలను కూడా గల్లంతు చేసుకున్నాయి.

ఇక ఈ సీజన్ లో ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలను గల్లంతు చేసుకున్న ఆ మూడు జట్లు ఏవో తెలుసుకుందాం. గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ జట్టు ఇప్పటికే గత ఐపిఎల్ సీజన్ లలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించడంతో ఈ సీజన్ లో కూడా ఈ జట్టు మంచి ఆట తీరని కనబరుస్తుంది అని జనాలు అనుకున్నారు. కాకపోతే ఈ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడగా అందులో కేవలం ఐదు మ్యాచ్ లలో గెలుపొంది 7 మ్యాచ్లలో ఓడిపోయి 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది.

ఇక ఎన్నో సార్లు ఐపీఎల్ ట్రోఫీలను సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడి అందులో 4 మ్యాచ్లలో గెలుపొంది , తొమ్మిది మ్యాచ్లలో ఓడిపోయి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది. ఇక కింగ్స్ 11 పంజాబ్ జట్టు 12 మ్యాచ్ లను ఆడి కేవలం ఎనిమిది పాయింట్లతో ఆకరి స్తానంలో ఉంది. ఈ మూడు జట్లు కూడా ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలను వదులుకున్నాయి. ఇక ఈ జట్ల అభిమానులు నెక్స్ట్ సీజన్ పైనే ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: