అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎంవీఆర్ ఖాయం?

Anilkumar
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఏ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారనే విషయాల గురించి అందరిలోనూ ఆత్రుత నెలకొంది. ఈ క్రమంలోనే కాపులకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి జనసేన పార్టీ నుంచి పలువురు పోటీకి దిగుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ మరోవైపు అనకాపల్లి నుంచి ఎంవీఆర్ పోటీ ఖాయమని తెలుస్తోంది.
ఎన్టీఆర్ అనకాపల్లి నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారు ముత్యాల వెంకటరావు టెక్స్టైల్స్ రంగంలో గత నాలుగు దశాబ్దాలుగా ఎంతో విజయవంతం అయ్యారు. ఇలా వ్యాపారవేత్తగా ఈయనకు ఢిల్లీ దాకా ఎంతో మంచి పరిచయాలు ఉన్నాయి.
ఇలాంటి వ్యక్తిని పార్టీలోకి చేర్చుకుంటే తమ పార్టీకి ఎంతో ఆర్థిక బలం ఉంటుందని ఎంతో మంది రాజకీయ నాయకులు ఈయనని తమ పార్టీలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈయన కూడా రాజకీయాలలోకి రావాలని ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయం తెలియదు కానీ ఈయనకు ఏ నాయకులు కూడా టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కూడా అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
ఎంవిఆర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గెలుపు తనదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా సునాసాయంగా అనకాపల్లి నియోజకవర్గంలో  గెలుపొందుకొని ఎంవీఆర్ ఎవరు అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే.. ఈయన గత నాలుగు దశాబ్దాలుగా టెక్స్టైల్ వ్యాపారంలో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే కేవలం వ్యాపారంలోనే మాత్రమే కాకుండా మంచితనంలో కూడా ఈయనకు ఎవరు సాటిరారు పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలను నెలకొల్పి పరిసర ప్రాంతాలలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు.
ఇక తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలాలకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తానున్నానని ముందుకు వెళ్తారు. ఇలా తన నియోజకవర్గంలోని ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ ఉన్నటువంటి ఈయన ఎన్నికలలో కనుక పోటీ చేస్తే తప్పకుండా గెలుపు ఖాయం అనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఈయన సహాయ సహకారాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున దైవదర్శనాలకు వెళ్లడం పురాతన ఆలయాల అభివృద్ధికి దోహదపడటం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇలా ప్రజలలో ఎంతో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి ఎంవీఆర్ ఎన్నికలలో నిలబడితే కనుక తప్పకుండా భారీ మెజార్టీతో గెలుపొందుతారు. ఇక ఈయన రాజకీయాలలోకి రాబోతున్నారనే విషయం తెలియడంతో అన్ని పార్టీ నేతలలో ఒక గుబులు మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: